ఒకే స్టోరీ లైన్తో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజున రిలీజ్

ఒకే స్టోరీ లైన్ తో చాలా సినిమాలు రావడం మనం చూసుంటాం. ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే.. కానీ ఒకే స్టోరీ లైన్ తో రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవడం అనేది చాలా రేర్ . ఇలాంటి రేర్ ఇన్సిడెంట్ తెలుగు ఇండస్ట్రీలో 1989వ సంవత్సరంలో జరిగింది. ఇంతకీ ఆ రెండు చిత్రాలు ఏంటంటే వెంకటేష్ హీరోగా వచ్చిన దృవనక్షత్రం ఒకటి కాగా, రెండోది బాలకృష్ణ హీరోగా వచ్చిన అశోక చక్రవర్తి.

అశోక చక్రవర్తి విషయానికి వస్తే.. ఎస్.ఎస్.రవి చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన భానుప్రియ హీరోయిన్ గా నటించింది. ఇళయరాజా సంగీతం అందించారు. 1988లో మలయాళం స్టార్ మోహన్ లాల్ -నటించిన ఆర్యన్ చిత్రానికి ఇది రిమేక్. ఇక ధృవ నక్షత్రం విషయానికి వస్తే.. నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన రజనీ హీరోయిన్ గా నటించింది. ఇళయరాజా చక్రవర్తి అందించారు.

ఈ రెండు చిత్రాలు 1989 జూన్ 29న రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు చూసిన ప్రేక్షకులు ఈ రెండు సినిమా స్టోరీ లు ఒకేలాగా ఉన్నాయని ఆశ్చర్యపోయారంట. అయితే ఇందులో బాలయ్య అశోక చక్రవర్తి ప్లాప్ కాగా, వెంకటేష్ ధృవ నక్షత్రం బాక్స్ ఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలకు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించడం విశేషం. మొత్తంగా ఒక తరహా కథలో ఇద్దరు హీరోలు నటించడం అనేది ఇండస్ట్రీలో రేర్

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here