మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హేలీ రైడ్ ను ఏర్పాటు చేస్తున్నది. బెంగుళూరు కు చెందిన తుంబి ఎవియేషన్ సంస్థ ఈనెల 13 నుంచి ఆరు రోజుల పాటు ఈ హెలికాప్టర్ను అందుబాటులో ఉంచనుంది. . మేడారం జాతరకు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ ప్రకటన విడుదల చేశారు.
హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి మేడారం వరకు అప్ అండ్ డౌన్ ట్రిప్కు ఒక్కొక్కరికి రూ. 19,999 ఛార్జ్ చేస్తారు. మేడారం జాతర ప్రాంగణంలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కొక్కరికి రూ. 3700 ఛార్జ్ చేస్తారు. మహా జాతరకు వచ్చే భక్తులు ఈ అరుదైన సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
హేలీ రైడ్ టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే 9400399999,9880505905 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని పర్యాటక శాఖ వెల్లడించింది.
పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. https://helitaxii.com/