ఇబ్రహింపట్నం నియోజకవర్గం
డివిజన్లు : అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలు,
మున్సిపాలిటీలు; ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలు
రూరల్ ఓటర్లతో పాటు సిటీ ఓటర్లున్న సెగ్మెంట్. ఎస్సీలు, ఎస్టీల ఓటు బ్యాంకు కూడా కీలకం.
ఎమ్మెల్యే : మంచిరెడ్డి కిషన్రెడ్డి (టీఆర్ఎస్)
Ibrahimpatnam Election Results 2018
2018 Assembly Elections
Candidate Name | Party | Votes |
MANCHIREDDY KISHAN REDDY | Telangana Rashtra Samithi | 72581 |
MALREDDY RANGA REDDY | Bahujan Samaj Party | 72205 |
SAMA RANGA REDDY | Telugu Desam | 18053 |
ASHOK KOTHA | Bharatiya Janata Party | 17129 |
PAGADALA YADAIAH | Communist Party of India (Marxist) | 9106 |
BATANI KISTAIAH | Independent | 1220 |
T. RAJESHWARI | Jatiya Mahila Party | 1123 |
SAPAVAT DEVARAM NAYAK | Independent | 559 |
TIRUMAL REDDY. S | Independent | 470 |
SAMREDDY SHIV KESH REDDY | Shiv Sena | 467 |
SURAKANTI VIMALA REDDY | Independent | 396 |
K. RAVINDER REDDY | Independent | 356 |
BP GANESH MUDIRAJ | Samajwadi Party | 334 |
None of the Above | None of the Above | 1151 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | MANCHIREDDY KISHAN REDDY | TRS | 72581 | MALREDDY RANGA REDDY | BSP | 72205 |
2014 | Manchireddy Kishan Reddy | TDP | 48397 | Malreddy Ramreddy | IND | 37341 |
2009 | Manchireddy Kishan Reddy | TDP | 56508 | Malreddy Ranga Reddy | INC | 47292 |
2004 | Masku Narsimha | CPM | 67288 | Narra Ravi Kumar | TDP | 54481 |
వరుసగా మంచిరెడ్డి ఇక్కడ మూడోసారి గెలిచారు. కాంగ్రెస్ మద్దతులో బీఎస్పీ గుర్తుపై పోటీ చేసిన మల్రెడ్డి రంగారెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. కేవలం 300 ఓట్లతో ఓడిపోయాడు. మంచిరెడ్డిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయంగా ఎదిగిన లీడర్లు లేకపోవటం మంచిరెడ్డికి కలిసి వస్తోంది.
కాంగ్రెస్ కు గట్టి పట్టుంది. బలమైన కేడర్ కూడా ఉంది. మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఒకటి మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. రంగారెడ్డి మినహా చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరూ లేరు. మల్రెడ్డి రంగారెడ్డి తమ్ముడు రాంరెడ్డి భార్య అనురాధారెడ్డి తుర్క యంజాల్ మున్సిపల్ ఛైర్మన్గా ఉన్నారు. కొత్త ఆర్తిక ఆదిభట్ల మున్సిపల్ ఛైర్మన్గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరి పదవి చేపట్టిన ఆర్తిక కౌన్సిలర్లతో విభేదాలతో మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి ప్రభావం కూడా ఈ నియోజకవర్గంపై ఎక్కువగా ఉంది.
గతంలో పోలిస్తే బీజేపీ పుంజుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన కొత్త అశోక్గౌడ్ ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జీగా ఉన్నారు. ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ కొప్పు బాషా (యాచారం ఎంపీపీ భర్త) యాక్టివ్గా ఉన్నారు.
వైసీపీ నుంచి ఎన్.జంగయ్య గౌడ్ స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఆయనే యాక్టివ్గా ఉన్నారు. ఈయనది మంచాల మండలం. తుర్క యంజాల్ కు చెందిన అమృత సాగర్ కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటున్నారు.
నియోజకవర్గంలో సమస్యలు
@ అబ్దుల్లాపూర్పేట్ మండలం బండరావిరాల, చిన్న రావిరాల గ్రామాలను మైనింగ్ జోన్ పరిధిలోకి తీసుకున్నారు. దాదాపు 600 ఎకరాల్లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయలేదు.
@ యాచారం, కందుకూర్, కడ్తాల్ మండలాల మధ్యలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీ ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటికే దాదాపు 9 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మరో 10 వేల ఎకరాలు సేకరించే పనిలో ఉంది. దీనిపై స్థానికంగా అన్ని గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.