ఈ రోజుల్లో రోజు వారి పనుల్లో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ తర్వాత అనేక వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముందే వ్యాధిని గుర్తించి, దాన్ని అదుపులో పెట్టడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ రోజుల్లో మధుమేహం అనేది చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే వ్యాధి సంక్రమించిన వారు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో పెట్టుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకోసం నివారించాల్సిన కారకాలేంటంటే..
వర్క్ హోలీక్
ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ పని పేరుతో ఎక్కువసేపు కూర్చోవడం రక్తంలో చక్కెర స్థాయిని బాగా ప్రభావితం చేస్తుంది
కొన్ని గ్లాసులు నీరు
ఇది మీకు ఇబ్బంది కలిగించకపోయినా రోజంతా సులభంగా కొనసాగించవచ్చు. తక్కువ హైడ్రేషన్ మధుమేహాన్ని ప్రభావితం చేస్తుంది.
భోజనం దాటివేయడం /ఆలస్యం చేయడం
ఇంట్లో పనులు చేస్తూ చాలామంది భోజనం దాటి వేయడం చేస్తూ ఉంటారు. డిన్నర్ తప్పిపోయినా లేదా ఆలస్యం చేసినా పట్టించుకోరు. దీని వల్ల మధుమేహం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
మోతాదులో మందులు
కేవలం మందులు తీసుకోవడం వల్ల మధుమేహం తక్కువ కాదు. కొన్ని సార్లు సరికాని లేదా మోతాదులో తీసుకోవడం వల్ల కూడా నయం కాదు.
ఒత్తిడి
అదనపు భారాలను మీపై వేసుకోవడం, తీసుకోవడం కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
తక్కువ నిద్ర
చాలామంది దీనిని ప్రతిభగా భావిస్తారు. కానీ తక్కువ నిద్ర అనేది మధుమేహానికి మారువేషంలో ఉన్న కిల్లర్ వంటిది.
వైద్య పరీక్షలు లేవు
బ్లడ్ ఘగర్ కోసం కొన్ని వైద్య పరీక్షలను కోల్పోవడo సరైనది కాదు
ఇతర మందులు
రక్తంలో చక్కర స్థాయిలు పెరగడానికి ఇది మరొక కారణం.
హార్మోన్లలో మార్పులు
హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు వల్ల ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం అవుతుంది.