టీఆర్​ఎస్​లో చేరనున్న చెల్మడ.. వేములవాడ నుంచి పోటికి దిగే ఛాన్స్​

కరీంనగర్ రాజకీయాలు మళ్లీ కీలక మలుపులు తిరుగుతున్నాయి. 2023 ఎన్నికలకు ఇక్కడి లీడర్లు అడ్వాన్సుగానే బెర్త్​లు ఖరారు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి చెల్మడ ఆనందరావు కుమారుడు.. కాంగ్రెస్​ నాయకుడు చెల్మెడ లక్ష్మి నరసింహరావు టీఆర్​ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ వారం పది రోజుల్లో ఆయన చేరికకు ముహూర్తం ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఇప్పటికే​ చెల్మెడకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కరీంనగర్​ వెళ్లినప్పుడు కేటీఆర్​ చెల్మెడ గెస్ట్ హౌస్​లోనే ఉన్నారని.. అక్కడే పార్టీలో ఎంట్రీకి లైన్​ క్లియర్​ అయినట్లు సమాచారం.

చెల్మెడ లక్ష్మి నరసింహరావు గతంలో రెండు సార్లు కరీంనగర్​ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సీటుకు పోటీ చేశారు. ఒకసారి ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేశారు. మూడు సార్లు ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. దీంతో 2018 ఎన్నికల నుంచి చెల్మెడ సైలెటంయ్యారు. కాంగ్రెస్​ పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగానే ఉంటున్నారు.

ఇటీవల కరీంనగర్​లో మాజీ మేయర్ రవీందర్​ సింగ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి.. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా తిరుగుబాటు చేశారు. దీంతో ఇక్కడ పోటీని టీఆర్​ఎస్ ఛాలెంజ్ గా తీసుకుంది. అక్కడ పార్టీకి ఢోకా లేదని సంకేతమిచ్చేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే చెల్మెడ చేరికకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

కరీంనగర్లో ఏళ్లకేళ్లుగా రాజకీయంగా వెలమ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. తమ సామాజిక వర్గం బలంగా ఉండటంతో పాటు.. అధికారంలో ఉన్న టీఆర్​ఎస్​లో చేరితేనే తనకు రాజకీయ భవితవ్యం ఉంటుందని చెల్మెడ పార్టీ మారేందుకు సిద్ధపడ్డట్లు చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా.. లేదా కరీంనగర్​ నుంచి ఎంపీగా చెల్మెడను పోటీలో దింపాలనేది టీఆర్ఎస్​ ఫ్యూచర్​​ ప్లాన్​గా కనిపిస్తోంది. ఒక వేళ వేములవాడకు ఉప ఎన్నిక వచ్చినా.. చెల్మెడను అక్కడ పోటీకి దింపాలనే ఆలోచనకు ముందస్తుగానే రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here