‘ఫిదా’ కోసం సాయిపల్లవి కంటే ముందు బాలీవుడ్ హీరోయిన్ ను అనుకున్న శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన చిత్రం ఫిదా. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించాడు. 2017జూలై 21 విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు సినిమాకు బిగెస్ట్ హైలెట్ గా నిలిచాయి. ఇక వరుణ్ తేజ్, సాయి పల్లవి నటన సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది.

అయితే ఈ సినిమాను ముందుగా వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో తీయాలని శేఖర్ కమ్ముల అనుకోలేదట. మొదట మహేష్‌ బాబుకు కథ వినిపించారట శేఖర్. ఆయనకు స్టోరీ చాలా నచ్చిందట. సినిమాలో కొన్ని మార్పులు కూడా చెప్పారట. మహేష్. ఇక మహేశ్​కి జోడీగా బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకునేను అనుకున్నాడట. మహేశ్​కు ఈ కథ విపరీతంగా నచ్చడంతో భారీ బడ్జెట్​తో ప్లాన్​ చేశాడట. అన్నీ ఓకే అనుకునే సమయానికి మహేశ్‌కు డేట్స్‌ కుదరలేదట. దీంతో ఈ సినిమాను చేయలేనని చెప్పారట

దీంతో వారి ప్లేస్ లో వరుణ్​ తేజ్, సాయి పల్లవిలను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కి్ంచారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా సాయి పల్లవిని ఎక్కడికో తీసుకువెళ్లిందనే చెప్పాలి. సాయిపల్లవి లేకుండా ఈ సినిమాను ఆడియెన్స్​ అస్సలు ఊహించుకోలేరు. అంతలా ఆమె క్యారెక్టర్​ ఆకట్టుకుంది. ఈ హీరోయిన్​ సొంత డబ్బింగ్​ సినిమాకు మేజర్​ ప్లస్​ పాయింట్​గా నిలిచింది. ఒకవేళ మహేష్, దీపికా పదుకునే ఈ సినిమా చేసుకుంటే ఎలా ఉండేదని నెట్టింట చర్చ జరుగుతుంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here