మాస్ హీరో, మాస్ డైరక్టర్ కాంబినేషన్ లోఓ సినిమా వస్తుందంటే ఆ సినిమా పైన అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటిదే నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే అంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలు సూపర్ హిట్స్ కావడం.
దీంతో కథ విషయంలో బి గోపాల్ ఎక్కడ కూడా రాజీపడలేదు. 30కి పైగా కథలు విని మరి సమరసింహారెడ్డి కథను ఫిక్స్ చేసుకున్నారు గోపాల్. సిందూరపువ్వు అనే తమిళ సినిమా నుంచి మెయిన్ కథని తీసుకొని, కొన్ని మార్పులు చేసి సమరసింహారెడ్డి సినిమా కథని రాసుకున్నారు విజయేంద్రప్రసాద్. అప్పటికి విజయేంద్రప్రసాద్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు ఈ సినిమా కథకు రాయలసీమ ఫాక్షన్ ని జత చేశారు. సమరసింహారెడ్డి చిత్రంతోనే ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ చిత్రాలకు జోష్ వచ్చింది.
అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్లుగా రాశి, సంఘవి, అంజలా జవేరిలను అనుకున్నారు గోపాల్. కానీ రాశి.. సినిమాలో వచ్చే సీతాకోకచిలుక సన్నివేశానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె ప్లేస్ లో సిమ్రాన్ ని తీసుకున్నారు గోపాల్ . సెమ్ ఇలాగే రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో కాస్త చీర పైకి కట్టాలని దర్శకుడు సుకుమార్ చెబితే ఆ చిత్రాన్ని కూడా రాశి వదులుకున్నారు.
ఇక సుమారు ఆరు కోట్లతో తెరకెక్కిన సమరసింహారెడ్డి సినిమా ఏకంగా 16 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం మూడు థియేటర్లలో 227 రోజులు, 29 కేంద్రాలలో 175 రోజులు, 122 కేంద్రాలలో 50 రోజులు, 73 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఈ సినిమాకి గాను ఉత్తమ దర్శకుడిగా బి గోపాల్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకోవడం విశేషం.