సొంత జాగా ఉన్నోళ్లు రూ.3 లక్షల స్కీమ్​కు ఎలా అప్లై చేసుకోవాలి

తెలంగాణ ప్రభుత్వం సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల స్కీమ్ అమలు చేస్తోంది. దీనికి ఎలా అప్లై చేయాలి.. ఎవరెవరు ఈ స్కీమ్​కు అర్హులవుతారు..? ఏమేం నిబంధనలున్నాయో తెలుసుకుందాం.

రూ. 3 లక్షల స్కీమ్​కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు సిద్ధం చేసింది. త్వరలోనే కేబినేట్​లో ఆమోదించి పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఈ నెలలోనే ఈ పథకం ప్రారంభమవనుంది. 15 రోజుల్లో స్కీమ్​ అమలు చేస్తామని ఇటీవల మహబూబ్​నగర్​ జిల్లాలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

మార్గదర్శకాలు

  1. సొంత జాగా ఉండి.. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న పేదలందరూ ఈ స్కీమ్​కు అర్హులవుతారు.
  2. ఎంపికైన లబ్ధిదారులకు విడతల వారీగా రూ.3లక్షల సాయాన్ని అందజేస్తారు. మూడు విడతలుగా ఈ సాయం అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
  3. ఇంటి నిర్మాణానికి కనీసం 75 గజాల స్థలం ఉండాలి. ఈ భూమి తమ సొంతమై ఉండాలి.
  4. మహిళా లబ్ధిదారుల పేరిటే ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
  5. గ్రామాల వారీగా అర్హుల నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తారు.
  6. తహసీల్దార్‌, ఎంపీడీవోలు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తారు. వీటిని కలెక్టర్‌ ఆమోదిస్తారు.
  7. జిల్లా కలెక్టర్లు పంపించిన జాబితాలను ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేస్తారు
  8. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరగని గ్రామాల్లో ముందుగా ఈ స్కీమ్​ అమలు చేస్తారు.
  9. గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందినవారు ఈ పథకానికి అనర్హులు.
  10. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల డేటా ఆధారంగా అనర్హులను ఏరివేస్తారు.
  11. ముందుగా ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా రూ.3 లక్షల సాయమే అందిస్తారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here