సిట్టింగ్​లకు సీట్లు ఇస్తే.. అయిదుగురు మంత్రులకు గండం.. ఆ జాబితాలో ఎవరున్నారు…

సిట్టింగ్​ ఎమ్మెల్యేలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని టీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ కుండబద్దలు కొట్టారు. ఈ నిర్ణయం వచ్చే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అటు టీఆర్​ఎస్​ తో పాటు ఇతర పార్టీల్లోనూ ఆసక్తి రేపుతోంది. సిట్టింగ్​లకు టికెట్లు ఇస్తే టీఆర్​ఎస్​కు లాభం జరుగుతుందా..? లేకుంటే దెబ్బతింటుందా..? అనే చర్చకు తావిచ్చింది. ఆన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్​లు మళ్లీ పోటీ చేస్తే.. వారిలో ఎంత మంది గెలిచే అవకాశముంది.. ఎంత మంది ఓడిపోయే ప్రమాదముంది.. అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్​.

2018 ఎన్నికల్లో టీఆర్​ఎస్​ రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 88 సీట్లను గెలుచుకుంది. వరుసగా మిగతా పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవటం.. నాలుగేండ్లలో చోటు చేసుకున్న రకరకాల పరిణామాలు.. ఉప ఎన్నికల కారణంగా . టీఆర్​ఎస్​ బలం 102కు చేరుకుంది. వీరందరినీ మళ్లీ పోటీకి దింపాలని టీఆర్​ఎస్​ బాస్​ తీసుకున్న తాజా నిర్ణయంతో 2023 ఎన్నికలకు సైరన్​ ఊదినట్లయింది. అదే సమయంలో 102 మందిలో సునాయాసంగా గెలిచే సిట్టింగ్​లు ఎందరు ఉన్నారు… ఆయా నియోజకవర్గాల్లో ఎంతమందికి ఓట్ల గండం పొంచి ఉందనే విశ్లేషణలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.

ఎమ్మెల్యేల పనితీరు.. ప్రజాదరణ.. ప్రజల్లో వ్యతిరేకతను పక్కనబెడితే.. గత ఎన్నికల్లో బొటాబోటీ ఓట్ల మెజారిటీతో బయటపడ్డ ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నిక గండమే. అంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఈసారి సొంత నియోజకవర్గాల్లో కత్తి మీద సాము తప్పదు. ఈ లెక్కన చూస్తే.. 2018 ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్యేల్లో 26 మంది అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డ వారే ఉన్నారు. కేవలం పది వేల ఓట్ల లోపు మెజారిటీతో వీరందరూ విజేతలయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో 5000 ఓట్లు అటు ఇటయితే.. అక్కడ ఓటమి వీరిని వెంటాడిందని అర్థమవుతోంది.

టీఆర్​ఎస్​ సిట్టింగ్​ల్లో 26 మంది కేవలం 10 వేల లోపు ఓట్లతోనే గెలిచారు. వీరందరికీ ఓట్ల గండం పొంచి ఉంది. ఇటీవల మునుగోడు బై ఎలక్షన్​లో గెలిచిన టీఆర్​ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి కేవలం 10 వేల చిలుకు ఓట్లతో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిపై గెలిచారు. మరో అయిదు వేల ఓట్లు బీజేపీ సాధించి ఉంటే.. టీఆర్​ఎస్​ అక్కడ ఓటమి పాలయ్యే పరిస్థితి కనిపించింది. అందుకే అత్తెసరు ఓట్ల మెజారిటీ ఉన్న సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలు ​గండంగానే భావించాలి. అటువంటి వారెవరు ఉన్నారో చూద్దాం. అయిదుగురు రాష్ట్ర మంత్రులతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో కొందరు అదె సెగ్మెంట్ నుంచి వరుసగా మూడోసారి పోటీకి సిద్ధమవుతున్నారు.

మంత్రులునియోజకవర్గంమెజారిటీ (2018)
కొప్పుల ఈశ్వర్ ధర్మపురి441
జగదీష్​రెడ్డి సూర్యాపేట5967
పటోళ్ల సబితారెడ్డి మహేశ్వరం9227
అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి నిర్మల్​9271
పువ్వాడ అజయ్​కుమార్​ ఖమ్మం10991
ఎమ్మెల్యేలు
ఆత్రం సక్కు అసిఫాబాద్171
మంచిరెడ్డి కిషన్​రెడ్డి ఇబ్రహింపట్నం376
బొల్లం మల్లయ్య యాదవ్​ కోదాడ756
కాలేరు వెంకటేశంఅంబర్​పేట1016
గ్యాదరి కిషోర్​కుమార్​తుంగతుర్తి1847
లావుడ్య రాములువైరా2013
రోహిత్​రెడ్డి తాండూర్​2875
బానోతు హరిప్రియఇల్లందు2887
మెతుకు ఆనంద్​వికారాబాద్​3092
జైపాల్​ యాదవ్​ కల్వకుర్తి3447
వనమా వెంకటేశ్వరరావుకొత్తగూడెం4139
గంప గోవర్ధన్​కామారెడ్డి4557
ఎన్​.దివాకర్​రావుమంచిర్యాల4848
బాపూరావు రాథోడ్​ బోథ్​6486
కందాల ఉపేందర్​రెడ్డిపాలేరు7669
షకీల్​ మహమ్మద్​బోదన్​8101
చిరుమర్తి లింగయ్య నకిరేకల్​8259
దాసరి మనోహర్​రెడ్డి పెద్దపల్లి8466
గువ్వల బాలరాజుఅచ్చంపేట9114
పట్నం నరేందర్​రెడ్డికొడంగల్​9319
కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి మునుగోడు10113 (2022 Bye Election)

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here